Andhra Pradesh:ధిక్కారానికి ఏపీపీఎస్సీ

APPSC Chairman Anuradha

Andhra Pradesh:ధిక్కారానికి ఏపీపీఎస్సీ:ఏపీపీఎస్సీ ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. కానీ ఏపీ ప్రభుత్వంలో అంతర్భాగమే. ఇప్పుడు అదే ప్రభుత్వం ఆదేశాలను ఏపీపీఎస్సీ పట్టించుకోకపోవడం ఏమిటి? నిజంగా ఏపీపీఎస్సీ పారదర్శకంగా వ్యవహరించిందా? ఎన్నికల కోడ్ లో భాగంగానే ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోలేదా? తీవ్ర ఉత్కంఠ నడుమ ఈరోజు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విధానాన్ని సరి చేయాల్సి ఉన్నందున.. కొద్దిరోజులపాటు పరీక్ష వాయిదా వేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఏపీపీఎస్సీ బోర్డుకు లేఖ రాశారు.

ధిక్కారానికి ఏపీపీఎస్సీ..

విజయవాడ, ఫిబ్రవరి 24
ఏపీపీఎస్సీ ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. కానీ ఏపీ ప్రభుత్వంలో అంతర్భాగమే. ఇప్పుడు అదే ప్రభుత్వం ఆదేశాలను ఏపీపీఎస్సీ పట్టించుకోకపోవడం ఏమిటి? నిజంగా ఏపీపీఎస్సీ పారదర్శకంగా వ్యవహరించిందా? ఎన్నికల కోడ్ లో భాగంగానే ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోలేదా? తీవ్ర ఉత్కంఠ నడుమ ఈరోజు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విధానాన్ని సరి చేయాల్సి ఉన్నందున.. కొద్దిరోజులపాటు పరీక్ష వాయిదా వేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఏపీపీఎస్సీ బోర్డుకు లేఖ రాశారు. అయితే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో పట్టభద్రులకు ప్రయోజనం కల్పించే విధంగా నిర్ణయం తీసుకోలేమని ఏపీపీఎస్సీ కార్యదర్శి తేల్చి చెప్పారు. దీంతో పరీక్షలు వాయిదా పడకుండా యధావిధిగా జరుగుతున్నాయి.అయితే సాక్షాత్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేఖ రాస్తే ఏపీపీఎస్సీ స్పందించకపోవడం ఏమిటని.. తమ నిర్ణయం మార్చుకోకపోవడం ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకటి ప్రభుత్వ ఆదేశాలను లోపయికారిగా అమలు చేసే ఉద్దేశమైనా ఉండాలి.. లేకుంటే ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా ఏపీపీఎస్సీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకునైన ఉండాలి. అయితే దీనిని ప్రచార అస్త్రంగా వాడుకుంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. నేరుగా వైసీపీ నేతలు విమర్శించడంతోపాటు సోషల్ మీడియా వేదికగా ఎన్నెన్నో ఆరోపణలు చేస్తున్నారు. అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళనను కొనసాగించారు. ఒకానొక దశలో అభ్యర్థులపై పోలీసులు ప్రతాపం చూపారు. ఇంకో వైపు చూస్తే నాలుగు రాష్ట్రాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ నిరుద్యోగుల నుంచి ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ తరుణంలోనే సీఎం చంద్రబాబు స్పందించారు. నేరుగా లేఖ రాశారు. కానీ ఏపీపీఎస్సీ మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం ప్రకటించలేదు. సీఎం కోరిన విధంగా పరీక్ష వాయిదా వేయలేదు.ఒకవేళ సీఎం చంద్రబాబు కోరిన విధంగా నిర్ణయం తీసుకోకుంటే మాత్రం.. ఎన్నికల కోడ్ తర్వాత ఏపీపీఎస్సీ బోర్డుపై చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన అనుమానం ఉంది. ఇప్పటికీ ఏపీపీఎస్సీ బోర్డులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మనుషులు ఉన్నారన్నది ప్రధాన అనుమానం. అందుకే తాజా పరిణామాల నేపథ్యంలో.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఏపీపీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు వేసే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
దటీజ్ అనురాధ
ఏపీపీఎస్సీ ఛైర్మన్ అనూరాధ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రభుత్వం ఆదేశాలను సయితం పట్టించుకోకుండా నిబంధనల మేరకు నడచుకోవడంతో ఆమె తీరుపై సోషల్ మీడియాలో పెద్దయెత్తున ప్రశంసలు తెలుపుతున్నారు. ఏపీపీఎస్సీ స్వతంత్ర సంస్థ. ప్రభుత్వంతో సంబంధం లేదు. అయితే అది బయటకు మాత్రమే. అయితే పాలకవర్గాన్ని నియమించేది ప్రభుత్వమే కాబట్టి సర్కార్ చెప్పినట్లు నడుచుకునే ఛైర్మన్ లను గతంలో చాలా మందిని చూశాం. కానీ అనూరాధ మాత్రం తన విధినిర్వహణలో నిబంధనలను ఏ మాత్రం అతిక్రమించకుండా ఆమె వ్యవహరిస్తున్న తీరు అందరిని మెచ్చుకునేలా చేస్తుంది. ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజనాలుంటాయి. కానీ స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ ఏపీపీఎస్సీకి అర్హులైన అభ్యర్థులను ఉద్యోగాలను ఎంపిక చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది. గ్రూప్ 2 ఎగ్జామ్స్ మెయిన్స్ పరీక్ష కు సంబంధించి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. హాల్ టిక్కెట్లు కూడా పంపింది. పరీక్ష కేంద్రాలను కూడా ఖరారు చేసింది. అయితే రోస్టర్ విధానంలో మార్పులు చేయాలని ప్రభుత్వం ఈ పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి లేఖ రాయాలని కోరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొందరు మనుషులను ఏపీపీఎస్సీకి పంపి పరీక్షను వాయిదా వేయాలని కోరారని చెబుతున్నారు. కానీ ఏపీపీఎస్సీ ఛైర్మన్ అనూరాధ మాత్రం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని, ముందుగా ప్రకటించిన విధంగానే పరీక్షలు జరుగుతాయని ప్రకటించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నందున పరీక్షలను వాయిదా వేస్తే దాని ప్రభావం ఎన్నికలపై పడుతుందని భావించి తాము వాయిదావేయలేమని ప్రభుత్వానికి లేఖ రాయడం నిజంగా సంచలనమే. అనూరాధ ఐపీఎస్ అధికారి. మాజీ పోలీసు అధికారి సురేంద్ర బాబు సతీమణి. మంచి అధికారిగా పేరుంది. అలాంటి అనూరాధ పరీక్షను వాయిదా వేయకుండా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే న్యాయస్థానంలో కేసులు నడుస్తున్నాయి. అనేక మంది అభ్యర్థులు పరీక్షలను వాయిదా వేయాలంటూ ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. ఆందోళనకు కూడా దిగారు. అందుకే ప్రభుత్వం చివరి నిమిషంలో వాయిదా వేయాలంటూ ఏపీపీఎస్సీని కోరింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోడ్ అమలులో ఉన్నందున, రోస్టర్ విధానాన్ని సవరించాల్సి ఉన్నందున వాయిదా వేయాలని కోరినా అనూరాధ మాత్రం నిబంధనల మేరకే నడుచుకున్నారన్న ప్రశంసలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి

Read more:Andhra Pradesh:ఆలయాలకు ర్యాంకులు

Related posts

Leave a Comment